AP: విజయనగరం గుర్లలోని కస్తురిబా పాఠశాలలో విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలింది. భారీ ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడటంతో గోడను పట్టుకున్న సుమారు 30 మందికి షాక్ కొట్టింది. దీంతో అధికారులు వారిని విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.