ప్రకాశం: మొంథా తుఫాన్ నేపథ్యంలో పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ను తహసీల్దార్ వాసు మంగళవారం ఉదయం పరిశీలించారు. తుఫాన్ కారణంగా రిజర్వాయర్కు భారీగా వర్షపు నీరు వచ్చి వేరే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రిజర్వాయర్ గేట్లు, కట్టకు ఎటువంటి డ్యామేజ్ ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.