అన్నమయ్య: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో, చిట్వేల్ మండలంలోని ZPHS స్కూల్లో సోమవారం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని HM బి. దుర్గరాజు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని ఆయన సూచించారు.