పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సులో భూమి కంపించింది. ప్రకంపనల కారణంగా మూడు భవనాలు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.