PDPL: రామగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందని ఎంపీ గడ్డం వంశీ తెలిపారు. రూ.2.46 కోట్లతో 2.1 కిలోమీటర్ల రోప్వే నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, పర్యాటకులు సులభంగా, సురక్షితంగా కొండపై చేరుతారని వెల్లడించారు. రామగిరి పరిసరాల అభివృద్ధికి మరో 2.5 కోట్లు కేటాయించి, ఖిల్లాను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తించనున్నారు.