SRCL: రాజన్న సిరిసిల్ల పట్టణంలో పౌష్టికాహారం, వాష్ కార్యక్రమాలపై బుధవారం అవగాహన నిర్వహించినట్టు డీఆర్డీవో గొట్టే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ గర్భం దాల్చిన నుంచి 1,000 రోజుల ప్రణాళిక చేతుల శుభ్రంగా కడుక్కోవడం, పెరటి కోళ్ల పెంపకం వంటి వాటిపై శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు.