SDPT: చెరువులు, కుంటల్లో చెత్త వేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ ఛైర్పర్సన్ చందన అన్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఆమె పాండవుల చెరువు శుభ్రత కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.