NRML: మామడ మండలం పొన్కల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈనెల 29 నుంచి వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్యాల రాజారెడ్డి కోరారు. సమావేశంలో భక్తులకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు.