SRD: నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఈనెల 23వ తేదీన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని మండల కేంద్రాలతో పాటు కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.