KMM: మధిరలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నిరవధిక సమ్మెను చేపట్టారు. వర్కర్లను పర్మినెంట్ చేయాలని, టైం స్కేల్ పెంచాలని, జిల్లా కలెక్టర్ గెజిటెడ్ ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.