BDK: పాల్వంచలోని కలెక్టర్ కార్యాలయం వద్ద భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అశ్వరావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులు చేపట్టిన ఆదివాసి ఆత్మగౌరవ నిరవధిక దీక్షలు సోమవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎనిమిది రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు.