BHNG: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. పెద్ద అంబర్పేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం (నేడు) మధ్యాహ్నం 1 నుంచి సా. 6 గంటల వరకు ఉండి ప్రజల వినతులు స్వీకరిస్తారని ఆయన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. స్థానిక సమస్యలను నేరుగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.