GDWL: జమ్మిచేడు జమ్ములమ్మకు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. కృష్ణానదీ జలాలతో అభిషేకించి, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం నిర్వహించారు. కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల భక్తులు దీపాల కాంతుల్లోని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.