MNCL: వార్డులో వ్యాధులు ప్రబలకుండా నివారణపై దృష్టి సారించామని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఐదో వార్డులోని వివిధ కాలనీలలో మున్సిపల్ కార్మికుల చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీలు చెత్తతో నిండిపోతే దోమల బెడద పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.