SDPT: దుబ్బాక రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సిద్దిపేటలోని ఓ టీ పాయింట్లో లంచం స్వీకరిస్తుండగా బుధవారం అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.