SDPT: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం తీవ్ర విషాదకరం అని హరీశ్ రావు అన్నారు. కార్మిక హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన ఆయనకు ఘన నివాళులు తెలిపారు. ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడవద్దని, సంఘటితంగా పోరాడాలని సూచించారు. ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. హామీలను అమలు చేసి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.