NGKL: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో మిషన్ భగీరథతో పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తాగునీటినే సరఫరా చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన కల్వకుర్తిలోని 60 ఎంఎల్డీ సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.