NRPT: మరికల్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ శత జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నారాయణపేట జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్, రాజేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.