కరీంనగర్ పట్టణ కేంద్రంలోని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గ్రామ స్థాయిలో బలోపేతం,నిర్మాణం, నిమ్నవర్గాల అభివృద్ధి కోసం పలు అంశాల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో దళితజాతి శ్రేయస్సు కోసం కార్యక్రమాలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నామన్నారు.