NLG: నల్గొండ జిల్లా కేతపల్లి మండలం రాయపురం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం క్రిస్మస్ వేడుకలో పాల్గొని మాట్లాడారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, క్షమాగుణం, నేర్పు, క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని, క్రీస్తు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు.