SDPT: ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర మంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని ఆయన కోరారు.