TG: పంచాయతీ నిధులకు సంబంధించిన అన్ని చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం చేసిన తర్వాతే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రెజరీ శాఖ సంచాలకుడు, జిల్లా, సబ్ ట్రెజరీ అధికారులకు ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు సంతకాలు పరిశీలించిన తర్వాతే వాటిని ఆమోదించి, నిధులు విడుదల నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.