KMM: గిరిజన వసతి గృహాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, శుక్రవారం ఖమ్మం నగరంలోని గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయం ఎదుట కార్మికులు, ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో, ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు.