JN: పాలకుర్తి మండలంలోని వల్మీడి గ్రామంలో పురాతమైన శివాలయంలో ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులతో కలిసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు.