VKB: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. నిన్న మారేపల్లితండా సమీపంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.