MBNR: మిడ్జిల్ మండలం వల్లభ రావు పల్లి గ్రామంలో ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. డెంగీ, చికెన్ గన్యా వంటి జ్వరాలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.