SRD: జిల్లాలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయన పరిశ్రమలు మూసివేయాలని ఆమ్ ఆద్మీ సెంట్రల్ కమిటీ సభ్యులు రాజేశ్వర్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలం దోమడుగు సమీపంలోని రసాయన పరిశ్రమలు పొలాల్లోకి కాలుష్య జలాలను వసతులున్నాయని ఆరోపించారు. ఈ పరిశ్రమలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.