చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ. 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు. అనంతరం ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.