NLG: రాష్ట్రవ్యాప్త మీటర్ రీడర్స్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే నిరసనకు మిర్యాలగూడ, హాలియా సభ్యులు మద్దతు ప్రకటించారు. తమకు 30 రోజుల పని కల్పించాలని, అర్హత ఉన్న వారిని సబ్ స్టేషన్ ఆపరేటర్లుగా నియమించాలని డిమాండ్ చేశారు. బిల్లింగ్ గడువు పెంచాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.