ADB: బజార్హత్నుర్ మండలంలోని పిప్రి గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను ఆయన నివాసంలో గురువారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.