BDK: పాల్వంచ మండలం జగన్నాధపురనికి చెందిన పవన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.1,25,000 పోగొట్టుకున్నట్లు మంగళవారం తెలిపారు. సెల్ఫోన్లో వచ్చిన టెలిగ్రామ్ లింక్ను పదేపదే క్లిక్ చేయడంతో ఒకసారి రూ.40 వేలు, మరోసారి రూ.20 వేలు ఇలా సొమ్ము మాయమవగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.