RR: ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత ఇస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మియాపూర్ మెట్రో గ్రౌండ్లో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్కు హాజరుకావాలని స్థానిక యువజన నాయకులు ఆయనను కోరారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను ఇచ్చారు.