HYD: రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వర్లపల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎం.శివానంద్ ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మంగళవారం జరిగిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు.