KMM: చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామపంచాయతీలో శనివారం ఉపాధి హామీ పథకం కింద రూ.8 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఫారసుతో మంజూరైన ఈ పనులను మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఓర్సు వీరభద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పల గోవిందరావు పాల్గొన్నారు.