JN: కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామంలో రూ.2.50 కోట్ల వ్యయంతో ఆయకట్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా అన్నారు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణంతో సాగు నీటి సమస్య పోతుందన్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. సురేష్, రంగయ్య తదితరులున్నారు.