ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పింఛన్ సేవలపై డిప్యూటీ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు సకాలంలో అందేలా చూడాలని, వెరిఫికేషన్ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. పారదర్శకతతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో వార్డు అధికారులు, ఆర్ఓలు (ROs) పాల్గొన్నారు.