నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా, తెప్ప పనితీరును పరిశీలించడం కోసం ఉదయం 10:30 గంటలకు పెన్నానది తీరంలోని తెప్పోత్సవ ఘాట్ వద్ద తెప్ప ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.