NZB: చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి షేక్ మూస గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంకో ప్రిన్సిపల్.. పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు త్వరంలో వెల్లడిస్తామని ఎస్సై సాయన్న సోమవారం తెలిపారు.