MDK: తూప్రాన్ పట్టణ పురాతన రామాలయంలో శుక్రవారం చక్రస్నానంతో రామాలయ శ్రీరామనవమి ఉత్సవాలను ముగించారు. గత నెల 25న ఉత్సవాలకు అంకురార్పణ చేపట్టగా, సీతారాముల కళ్యాణం, ప్రతిరోజు స్వామి వారి సేవల ఊరేగింపు చేపట్టారు. ఈరోజు ఉదయం స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. అనంతరం పసుపులేరు వాగులో స్వామివారి విగ్రహాలకు మున్సిపల్ ఛైర్మన్ దంపతులు చక్రస్నానం నిర్వహించారు.