GDWL: అలంపూర్లో ఉన్న ఐదో శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను శుక్రవారం కర్ణాటక రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్ఎస్. బోస్ రాజ్ దర్శించకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి ఆలయ మర్యాదలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆశీర్వచన మండపంలో శేషవస్త్రాలతో సత్కరించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.