NZB: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల 95వ వర్ధంతిని ధర్పల్లిలో ఘనంగా నిర్వహించారు. సోమవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్లు చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.