జగిత్యాల: ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు బండారి రాజయ్యకు వికలాంగుల కోటా కింద త్రి చక్రాల వాహనం మంజూరయ్యింది. సోమవారం వెల్గటూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారునికి వాహనం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, కాంగ్రెస్ ఉమ్మడి వెల్గటూరు నేతలు పాల్గొన్నారు.