కామారెడ్డిలోని అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ, ప్రైవేట్ డ్రైవర్లకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. SP రాజేశ్ చంద్ర హాజరై మాట్లాడారు. ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సిబ్బంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.