BDK: కొత్తగూడెం కార్పొరేషన్ రామవరంలోని షాపుల యజమానులు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ ఇవాళ సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పాటు అందుతుందని, ఏదైనా ఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించేందుకు ఆధారాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.