PDPL: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో పోలీసు కళాజాత బృందం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాటలు, నాటికల రూపంలో సైబర్ క్రైమ్, గంజాయి, చేతబడులు వంటి మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో సర్పంచ్ రజిత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.