BHPL: టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు సోమిడి వినయ్ కుమార్ కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంలో పత్తి పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోయిన ఆయన, ఈసారి మొక్కజొన్న సాగు చేశాడు. అయితే గ్రామం చుట్టుపక్కల అడవుల నుంచి వచ్చే కోతులు మొక్కజొన్న మొక్కలను పీకి, పంటను దెబ్బతీస్తున్నాయని ఆయన వాపోయాడు.