JGL: గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ అభివృద్ధి కోసం బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది పాదం తిరుపతి 50 వేల చెక్కును విరాళంగా అందించారు. దమ్మన్నపేట గ్రామ సర్పంచ్గా ముదాం గౌతమి ప్రమాణ స్వీకారం చేయగా తిరుపతి తల్లిదండ్రులు పాదం రాజవ్వ – రాజయ్యల జ్ఞాపకార్థం చెక్కును నూతన పాలకవర్గానికి అందించారు. రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.