BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన ఈవోగా కె.దామోదర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు భద్రాచలం ఆర్డీవోగా విధులు నిర్వహించిన దామోదర్రావు దేవాదాయ శాఖకు బదిలీ అయ్యారు. ఆలయ ఈవోగా పనిచేస్తున్న ఎల్.రమాదేవిని ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతి కల్పించింది.