ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అవోపా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 120 కేజీల వెండి వినాయకుడిని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.