ASF: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు గడువు పెంచడంతో రైతులు తమ పత్తిని అమ్ముకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. నేడు చివరి రోజు కావడంతో రైతులు వేగంగా పత్తిని అమ్మేందుకు తీసుకువస్తున్నారు.